Tuesday 19 July 2011

rastram renduga vunte thappenti

దేశంలో అనేక రాష్ట్రాలు రెండుగా మారిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా రెండుగా మారితే తప్పేంటని మాజీ మంత్రి, నాప్కాబ్‌ ఉపాధ్యక్షు డు, జై ఆంధ్రా ఉద్యమ నేత వసంత నాగేశ్వరరావు సమైక్యాంధ్ర వాదుల ను ప్రశ్నించారు. విజయవా డ ప్రెస్‌ క్లబ్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా చేసి ప్రత్యేకాంధ్ర, తెలంగాణా లను ఇవ్వాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అధిష్టానాన్ని కోరాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు వారి వారి రాజధానుల్లో పెట్టుబడులు పెట్టి సంతో షంగా జీవిస్తుంటే సీమాంధ్రవాసులు మాత్రం హైదరాబాద్‌లో ఉండకూడదని వేర్పాటువాదులు జాగో బాగో అంటుంటే ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

నాడు ప్రత్యేకాంధ్ర కావాలని కోరుకున్న వారు నేడు సమైక్యమని ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. సమైక్యాంధ్రలో తెలంగాణా భూములు అభివృద్ధి చెందితే ఆంధ్రా ప్రాంతంలో మాత్రం భూములు ధరలు పడిపోయాయన్నారు. విడిపోయి మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి పరచుకుందామన్నారు. సమైక్యాంధ్రా కోరుకునేవారు ఆంధ్రా అభివృద్ధిని అడ్డుకున్నట్టేనన్నారు. హైదారాబాద్‌లో ఇతర రాష్ట్రాలవారు ఉంటే తెలంగాణావాదులకు అభ్యంతరంలేదు గానీ సీమాంధ్రావారిపై మాత్రం దాడులు చేస్తున్నారని, దీని గురించి మంత్రులకు ముఖ్యమంత్రులకు పట్టడం లేదని విమర్శించారు.

t congress yudda beri

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసిన తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా్ర పతినిధులు గ్రామస్థాయిల్లోంచి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిధ్ధమయ్యారు. ఈ నెల 20 వ తేదీన తెలం గాణలోని 443 మండలాల్లో రాష్ట్ర సాధనకోసం సత్యా గ్రహ దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ నాయకులు ఉద్యమిస్తున్నారనే విషయాన్ని గ్రామగ్రామాన తీసుకు పోయేందుకుగానూ 26 వ తేదీన జెండాపండుగలు నిర్వహించనున్నారు.

కాంగ్రెస్‌ జెండాలో తెలంగాణ మ్యాప్‌తో కూడిన జెండాలను తెలంగాణ వ్యాప్తంగా ఎగురవేయాలని, పరిస్థితులను బట్టి అవసరమై తే ఈ నెలాఖరులో భారీబహిరంగ సభను కూడా నిర్విహ స్తామని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. సోమ వారం చంపాపేటలో ఒక ఫంక్షన్‌ హాలులో జరిగిన తెలం గాణ కాంగ్రెస్‌ విస్తృతస్తాయి సమావేశంలో పలు నిర్ణ యాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా, మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించారు.

సోమవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశంలో రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధు లే కాకుండా పలువురు జిల్లా, మండల స్తాయి కాంగ్రెస్‌ నాయకులు కూడా ప్రసంగించారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చే సిన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకు లను అభినందించారు. తెలంగాణ ఏర్పడే దాకా రాజీ నామాలను వెనక్కి తీసుకోవద్దని సూచించారు. అధిష్టానం బుజ్జగింపులకు లోబడి మళ్ళీ పదవుల్లో కొనసాగితే, నియోజక వర్గాల్లో తిరగనిచ్చేది లేదని కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు. తెలంగాణ కోసం రాజీ నామాలు చేసిన వారికి అండగా ఉంటామని తెలిపారు.

తెలంగాణ కోసం ఇకపై కాంగ్రెస్‌ నాయకులు గ్రామ గ్రామాన చేసే ఉద్యమాలు ఢిల్లిలో మార్మోగాలని మంత్రి జానారెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాదు పరిస్థితిని అర్ధం చేసుకొని కేంద్ర వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టాలని కోరారు. రెండు రోజుల క్రితమే సూడా న్‌ను 193 వ దేశంగా ప్రకటించారని, అక్కడి ప్రజలు కోరుకోవడం వల్లే అది సాధ్యమైందని, తెలంగాణలోని ప్రజలంతా పార్టీలకతీతంగా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకొంటు న్నారని, కేంద్రం వెంటనే దేశంలో 31 వ రాష్ట్రంగా తెలం గాణను ప్రకటించాలని జానారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆందోళనలు జరగకుండా, అభివృద్ది కుంటుపడకుండా తె లుగు ప్రజలను సామరస్యంగా రెండు రాష్ట్రాలుగా విడదీ యాలని కోరారు.

ప్రజల ఆకాంక్షను గుర్తించి దేశ విదే శాల్లో కాంగ్రెస్‌ ప్రతిష్ట పెరగడానికి వీలుగా, కాంగ్రెస్‌ చరి త్ర చిరకాలంగా ఉండేలా రాష్ట్ర ఏర్పాటు జరగాలని జానారెడ్డి అన్నా రు. అపుడే తెలంగాణ కాంగ్రెస్‌కు కంచు కోటగా మారుతుందని ఆయన చెప్పారు.రాజీనామాలు చేసిన మంత్రులు సమావేశాలకు రానం త మాత్రానా తెలంగాణ సాధనకు వ్యతిరేకం కాదని, కొన్ని వ్యక్తిగత పనులు ఉండడం వల్ల కొందరు రాలేక పోతు న్నారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ప్రభుత్వాన్ని సంక్షో భంలో పడవేసేందుకు రాజీనామాలు చేయలేదని, తెలం గాణ ఆవసరంపై అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే అలా చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం ఏ నిర్ణయం తీసుకొన్నా, కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించేలా ఉండాలని శ్రీధర్‌బాబు సూచించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యే వరకు పదవుల్లో చేరేది లేదని, బాధ్యతలు నిర్వహంచబోమని ఎంపీ పొన్నంప్రభాకర్‌ స్పష్టంచేశారు. తెలంగాణలో ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక రాష్ట్రం త్వరగా రావాలని పూజలు చేసే కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపై భవిష్యత్తులో గ్రామగ్రామాన కాం గ్రెస్‌ను బలోపేతం చేసుకుంటూ తెలంగాణ ఉద్యమం సాగించాలని చెప్పారు. రాష్ట్రంలో సమైక్యవాదుల పెత్తనం కొనసాగుతుందని, రాష్టానికి కేంద్రప్రభుత్వం సైనిక్‌ స్కూల్‌ని ఇస్తే ముఖ్యమంత్రి కిరణ్‌ తన స్వంత జిల్లాలో పెట్టుకొన్నారని మండిపడ్డారు. ఇదివరకు ఉన్న సైనిక ్‌స్కూల్‌ కూడా ఆంధ్రాప్రాంతంలోనే ఉందని చెప్పారు.

ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణలర్పించిన వారికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే అసలైన నివాళి అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనకోసం చేసిన రాజీనామాలను ప్రధానప్రతిపక్షం అయిన టీడిపి రాజ కీయం లబ్దికోసం వాడుకొంటుందని, అలా వాడుకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని యాష్కీ మండిపడ్డారు. ఆంధ్రప్రాంత నాయకులు అధిష్టానానికి వ్యతిరేకంగా మా ట్లాడి లబ్ది పొందుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షపదవులన్ని సీమాంధ్ర ప్రాంతానే ఉన్నాయని, తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలంటే రాష్ట్ర ఏర్పా టు తప్పనిసరి అని ఆయన చెప్పారు. తెలంగాణ మైనా ర్టీలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు.

తెలంగాణ కాంగ్రె్‌స్‌ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణ యించుకున్న కార్యాచరణను అమలు చేయడానికి ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త కృషి చేయాలని సభకు హాజరైన నాయ కులంతా పిలుపునిచ్చారు. ఇకపై ఎలాంటి కార్యాచరణ లను తీసుకున్నా అన్నింటిని విజయవంతం చేయాలని ఎంపీ కే కేశవరావు కోరారు. రాజీనామాలపై వెనకడుగు వేయమని ఆయన చెప్పారు. అవసరాన్ని బట్టి ఎప్పటికపు డు తెలంగాణ కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ కార్యచరణను ప్రకటిస్తుందని కేకే తెలిపారు.

సోమవారం తెలంగాణ కాంగ్రెస్‌ విసృ్తత స్థాయి సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు.
మంత్రులు.. కె జానారెడ్డి, బస్వరాజు సారయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి శ్రీధర్‌బాబు
ఎంపీలు.. కే కేశవరావు, మంద జగన్నాదం, కోమట ిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి వివేక్‌, గుత్తా సుఖేంధర్‌రెడ్డి. సిరిసిల్ల రాజయ్య, మధుయాష్కి, బలరాం నాయక్‌, పొన్నం ప్రభాకర్‌.
ఎమ్మెల్యేలు.. కే లకా్ష్మరెడ్డి, అబ్రహాం, భిక్షమయ్యగౌడ్‌, బాలూనాయక్‌, చిరుమర్తి లింగయ్య, రాంరెడ్డి దామోదర రెడ్డి, సుధీర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, గండ్ర వెంకటరమణారెడ్డి, టీ రాజయ్య, కే శ్రీధర్‌, ఆరెపల్లి మోహ న్‌, ప్రతాప్‌రెడ్డి, జూపల్లి కృష్టారావు, రాజేశ్వర్‌రెడ్డి, ముత్యం రెడ్డి, ప్రసాద్‌రెడ్డి.
వీరితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనాయకులు హాజరయ్యారు.

adistanam pi tiraga badaina telangana sadinchukuntam

తెలంగాణపై రెఫరెండానికీ రెడీ: జానారెడ్డి
రేపు తెలంగాణలో ‘సామూహిక నిరాహార దీక్ష’
26న ఊరూరా తెలంగాణ కాంగ్రెస్ జెండా పండుగ
నెలాఖరులోపు భారీ బహిరంగ సభ
తెలంగాణ కాంగ్రెస్ నేతల విస్తృత భేటీ తీర్మానాలు

తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ స్థాయి దాకా తీసుకెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటి దాకా ‘సామూహిక నిరాహార దీక్ష’ చేయాలని తీర్మానించారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 26న ఊరూరా తెలంగాణ కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించాలని, నెలాఖరులో భారీ బహిరంగ సభ జరపాలని సోమవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానించారు. అధిష్టానంపై తిరగబడైనా తెలంగాణ సాధించుకోవాలని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ పిలుపునిచ్చారు! డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే దళితుడే సీఎం కావచ్చన్నారు. జానారెడ్డి, కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల, బ్లాక్ నాయకులు, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, డీసీఎంఎస్ చైర్మన్లతో పాటు వందలాది మంది నేతలు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర సాధనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ‘‘26న గ్రామ, మున్సిపల్ వార్డు స్థాయిల్లో కాంగ్రెస్ కార్యకర్తలంతా తమ ఇళ్లపై తెలంగాణ ఆకారంలో రూపొందించిన కాంగ్రెస్ పతాకం ఎగరేసి ‘తెలంగాణ కాంగ్రెస్ జెండా’ పండుగ నిర్వహించాలి. ఆజాద్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను బాధించినందున ఆయన వాటిని ఉపసంహరించుకుంటే తప్ప ఢిల్లీ వెళ్లకూడదు’’ అని తీర్మానించారు.

సమావేశంలో సుమారు 40 మంది మాట్లాడారు. కమిటీ చేపట్టే ఏ ఉద్యమానికైనా పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని గతంలో చేసిన ప్రకటనను తక్షణం అమలు చేయాలని కేంద్రాన్ని జానారెడ్డి డిమాండ్ చేశారు. ‘‘90 శాతం మంది ప్రజల ఆమోదంతో రెఫరెండం ద్వారా దక్షిణ సూడాన్ కొత్త దేశంగా అవతరించింది. తెలంగాణలోనూ 90 శాతం మంది తాము ప్రత్యేక రాష్ట్రానికి సానుకూలమని వివిధ పద్ధతుల్లో తెలిపారు. రెఫరెండంతో సహా మరే పద్ధతిలో అయినా ప్రజాభిప్రాయాన్ని సేకరించితక్షణం తెలంగాణను ప్రకటించాలి’’ అన్నారు. విభజనలో ఆగ్రహాలు, ఆందోళనలు వెల్లువెత్తి అభివృద్ధి కుంటుపడకుండా సామరస్యంగా విడిపోయి రెండు ప్రాంతాల ప్రజలు విజ్ఞత చూపాలని కోరారు. తెలంగాణ సాధన చివరి దశలో ఉందని, కచ్చితంగా సాధించుకు తీరుతామని కేకే ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూనే తెలంగాణ సాధిస్తామని, రాజీ ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రులంతా ఏకతాటిపై ఉన్నా కొందరిని విడదీసేందుకు ప్రేలాపనలు చేస్తున్నారని మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలంతా రోడ్లపైకి వచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని జూపల్లి కృష్ణారావు సూచించారు. ‘‘ఒకరోజు ఇంటిముందు నిలబడి అరగంట పాటు తెలంగాణ నినాదాలు చేయాలి. మరో రోజంతా రోడ్లపై ఇంటి, వంట పనులు చేసుకోవాలి. ఇంకో రోజు రోడ్లను దిగ్బంధించాలి. అప్పుడే కేంద్రానికి తెలంగాణ సెగ తాకుతుంది’’ అన్నారు.

సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆర్థిక మూలాలను కబళిస్తేనే తెలంగాణ సాధ్యమని, సామూహిక దీక్షలతో ప్రయోజనముండదని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సీమాంధ్రులు నిర్మిస్తున్న సినిమాలన్నిటినీ బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. నెలాఖరు లోపు తెలంగాణ ప్రకటన రాకుంటే జెండా, ఎజెండాలను పక్కనపెట్టి ఐక్యంగా ఉద్యమిద్దామని దామోదర్‌రెడ్డి ప్రతిపాదించారు. తెలంగాణ ప్రజల దమ్మేంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ వివేక్ అన్నారు. కలిసుండలేమని తెలంగాణ ప్రజలంతా నెత్తినోరు కొట్టుకుంటున్నా కలిసుంటేనే కలదు సుఖమని సీమాంధ్ర నేతలనడం సిగ్గుచేటని ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ రాకుండా రాజీనామాల ఉపసంహరణ పులినోట్లో తల పెట్టడమే అవుతుందని ఎంపీ రాజయ్య అన్నారు. ఆగస్టు లోపు తెలంగాణ ప్రకటన రాకుంటే సింగరేణి కార్మికుల సమ్మెతో రాష్ట్రమంతటా కరెంటు సరఫరా ఆగుతుందని ఎమ్మెల్సీ బి.వెంకట్రావు హెచ్చరించారు. తెలంగాణకు సోనియా సానుకూలమైనా కోటరీ వల్లే వెనకాడుతున్నారని మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి అన్నారు.

charchala thvarane nirnayam: ఆజాద్

ఒక్కో ప్రాంతం నుంచి 5-10 మంది బృందంగా రావాలి
ముందుగా తెలంగాణ ప్రజా ప్రతినిధులతో మాట్లాడతా
ఢిల్లీలో ఆజాద్‌ను కలిసిన సీమాంధ్ర నేతల బృందం
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వినతి..
68 మంది నేతలు హాజరు.. కేంద్రమంత్రులు దూరం
నేడు ప్రధాని, ప్రణబ్, చిదంబరంలను కలవనున్న నేతలు
తెలంగాణ సమస్యపై మూడు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధుల ప్రతినిధి బృందాలతో చర్చించి ఎలా ముందుకు వెళ్లాలనేది నిర్ణయిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. ఒక్కో ప్రాంతం నుంచి ఐదుగురి నుంచి పది మంది వరకూ పార్టీ ప్రజాప్రతినిధుల ప్రతినిధి బృందం రావాలని సూచించారు. ‘‘తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను పిలిచాను. వారు రాలేదు. దీంతో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్నా’’ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్య రాష్ట్రంగానే కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానం, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సోమవారం ఢిల్లీ చేరుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాత్రి 10 గంటల సమయంలో ఆజాద్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. దాదాపు గంటన్నరపాటు ఆయనకు తమ వాదనలు వినిపించారు. అనంతరం ఆజాద్ తన కార్యాలయంవ వద్ద విలేకరులతో మాట్లాడారు. పార్టీ సీమాంధ్ర నేతలు చెప్పిందంతా విన్నానని, తానేమీ మాట్లాడలేదని ఆయన తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు రావటం వల్ల చర్చించటం కష్టమవుతుందని పేర్కొన్నారు. పరిమిత సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఉంటే చర్చలు సజావుగా సాగుతాయన్నారు. మూడు ప్రాంతాల (ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ) నుంచి 5 నుంచి 10 మంది సభ్యుల చొప్పున సంప్రదింపుల బృందంగా వస్తే చర్చించుకోవచ్చని సూచించారు. తెలంగాణ అంశం పరిష్కారం విషయంలో ముందుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలతో మాట్లాడతానని ఆజాద్ చెప్పారు.

సంమయనం పాటించండి: ఆజాద్ హితబోధ

ఆజాద్‌తో భేటీలో ఎంపీ కావూరి సాంబశివరావు, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి తదితరులు సమైక్య వాణిని గట్టిగా వినిపించినట్లు తెలిసింది. అలాగే.. ప్రాంతాల వారీగా వెనకబాటుతనాన్ని పారదోలటానికి చేపట్టాల్సిన చర్యలను కూడా సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారు చెప్పిందంతా విన్న ఆజాద్ సమావేశం చివరిలో.. ‘రాష్ట్రంలోని ఏ ప్రాంత నాయకులైనా సరే పరస్పరం పరుష పదజాలంతో దూషించుకోవటం సరికాదు. సంయమనంతో వ్యవహరించండి. మీరైనా, కార్యకర్తలైనా సరే సహనంతో ఉంటేనే ఈ సమస్య పరిష్కారమవుతుంది’ అని హితబోధ చేసినట్లు సమాచారం. ‘ఇప్పటికే రాష్ట్రంలోని భిన్న ప్రాంతాలవారు తమ నివేదనలు మాకు అందజేశారు. వాటిని పరిశీలిస్తున్నాం. ప్రతిసారీ ఇంత పెద్ద సంఖ్యలో రావటం కష్టం కదా. రాష్ట్రంలోని మూడుప్రాంతాల వారు పరిమిత సంఖ్యలో.. అంటే ఐదుగురికి తగ్గకుండా, 10 మందికి మించకుండా ప్రతినిధుల పేర్లను సూచించండి. ఆ ప్రతినిధుల బృందాలను నేను సమయానుసారం పిలిచి మాట్లాడతాను. సమస్యలు, వాస్తవ పరిస్థితులపై వారితో చర్చించి సమస్య పరిష్కారం దిశగా కృషిచేస్తాను. ఇదే విషయాన్ని ఇప్పటికే తెలంగాణ నాయకులకు కూడా చెప్పాను’ అని ఆజాద్ ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనికి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వెంటనే సమ్మతి తెలుపుతూ, తమ తరఫున పేర్లను కావూరి మీకు తెలియజేస్తారని పేర్కొన్నట్లు సమాచారం.

బ్లాక్‌మెయిళ్లకు తలొగ్గవద్దు: ఆజాద్‌కు నివేదన

కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ వాదనల సారాంశాన్ని రెండు పేజీల నివేదన రూపంలో ఆజాద్‌కు అందజేసింది. శ్రీకృష్ణ కమిటీ విస్తృత సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ, అధ్యయనం, పరిశోధన తర్వాత రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమే మంచిదంటూ నివేదికలో సూచించిన ఆరో ఆప్షన్ అమలు అందరికీ శ్రేయస్కరమని ఆ నివేదనలో కోరారు. ‘అభివృద్ధి లేదంటూ మొదట ఉద్యమం చేపట్టిన వారు గణాంకాలు చెప్తున్నది అందుకు భిన్నంగా ఉండటంతో సెంటిమెంట్, ఆత్మగౌరవం అంటూ కొత్త నినాదాలను అందుకున్నారు. ఈ సెంటిమెంట్ కూడా డిసెంబర్ 9, 2009 తర్వాత టీఆర్‌ఎస్, ఇతర పార్టీలు రెచ్చగొట్టటం వల్లే ఏర్పడింది’ అని అందులో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న మా సహచరుల నుంచి ఘోర అవమానాలు, బెదిరింపులు, హింసాకాండ, బ్లాక్‌మెయిల్ వచ్చినప్పటికీ క్రమశిక్షణ గల కాంగ్రెస్ వాదులుగా మేం మీ ఆదేశాలను పాటించి పూర్తి మౌనంగా ఉన్నాం. కానీ, మా మౌనం, వారి బ్లాక్‌మెయిల్ రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర నాయకత్వానికి భిన్నమైన అభిప్రాయాలు కలిగిస్తాయని మేం ఆందోళన చెందాం’ అని వివరించారు. బ్లాక్‌మెయిళ్లకు తలొగ్గవద్దని, దేశ సమైక్యత, సమగ్రతలను, ప్రజలను కాపాడేందుకు గట్టిగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

సీమాంధ్ర నేతల విందుకు ఆస్కార్ హాజరు

మూడు ప్రాంతాల నేతలతో చర్చించాకే తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొంటామని ఆజాద్ తమతో పేర్కొన్నట్లు కాంగ్రెస్ సమైక్యాంధ్ర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ చెప్పారు. హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్న దానిపై ఆజాద్ తమతో మాట్లాడలేదన్నారు. ఆజాద్‌తో భేటీ అనంతరం శైలజానాథ్, ఎంపీ కావూరి సాంబశివరావులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ‘సమైక్య’ వాణిని వినిపించటానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 68 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం ఢిల్లీ తరలివచ్చారు. వీరంతా మధ్యాహ్నం ఏలూరు కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు ఇంట్లో విందు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ పెద్దలతో చర్చించాల్సిన అంశాలపై సమాలోచనలు సాగించారు. ఆ సందర్భంగా శైలజానాథ్, గాదె వెంకటరెడ్డి, కావూరి తదితరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర నేతలంతా ఏకాభిప్రాయంతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే అభిప్రాయానికి వచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అంత తేలిక కాదని, దీన్ని అర్థం చేసుకున్నామని అధిష్టానం హామీ ఇచ్చినందుకే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నామని, ఇప్పుడు దాన్ని వక్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నందు వల్లే అధిష్టానం పెద్దలను మరోమారు కలవాల్సి వస్తోందని కావూరి చెప్పారు. రాత్రి ఆజాద్‌తో భేటీ ముగిసిన తర్వాత.. ఎంపీ నేదురుమల్లి నివాసంలో సీమాంధ్ర నాయకులు విందు సమావేశం నిర్వహించారు. ఈ విందులో పార్టీ అగ్రనేతల్లో ఒకరైన ఆస్కార్ ఫెర్నాండెజ్ కూడా పాల్గొనటం గమనార్హం.

నేడు ప్రధానిని కలవనున్న బృందం...

సీమాంధ్ర నేతలు బుధవారం వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు. తమ వాదన వినిపించటానికి పార్టీ, ప్రభుత్వ ముఖ్యులందరినీ కలవటానికి ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ లభించినట్లు వారు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎంపీలు మాత్రమే బృందంగా వెళ్లి ఆంటోనీని కలవనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు హోంమంత్రి చిదంబరాన్ని, సాయంత్రం 6 గంటలకు ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీని కలవటానికి సమయం లభించిందని సీమాంధ్ర నాయకులు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీలను కూడా అపాయింట్‌మెంట్లు కోరారు.

కేంద్రమంత్రులు దూరం...
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఢిల్లీ యాత్రలో కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు కనిపించకపోవటం ఒకింత చర్చనీయాంశమైంది. సీమాంధ్ర ప్రాంతం నుంచి రాష్ట్ర మంత్రిమండలిలో ఉన్న మంత్రుల్లో కొందరు మంత్రులు, ఎంపీల్లో పలువురు సోమవారం ఢిల్లీలో జరిగిన భేటీల్లో పాల్గొనలేదు. వీరు వీలువెంబడి మంగళవారం రావొచ్చని చెప్తున్నారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నలుగురు మంత్రుల్లో కేబినెట్ మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఈ హడావుడికి పూర్తిగా దూరంగా నిలవగా మిగతా ముగ్గురు సహాయమంత్రులు వేర్వేరు చోట్ల ఉండటంతో.. మొత్తంగా కేంద్రమంత్రులెవరూ కనిపించని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి, పళ్లంరాజు వివిధ కారణాల రీత్యా వేర్వేరు చోట్ల ఉన్నారని, అలాగే ఎంపీలు, రాష్ట్ర మంత్రుల్లోనూ ముందుగా అనుకున్న కార్యక్రమాల వల్ల రాలేకపోయినవారు కొందరున్నారని, వీరు రాలేకున్నా తామందరిదీ ఒకటే మాట అని వారు పేర్కొన్నారు.

ఢిల్లీయాత్రలో సోమవారం కనిపించిన నేతలు వీరే...

రాష్ట్ర మంత్రులు: సాకె శైలజానాథ్, ఆనం రామనారాయణరెడ్డి, డి.ఎల్.రవీంద్రారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కాసు వెంకటకష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సయ్యద్ మహ్మద్ అహ్మదుల్లా, టి.జి.వెంకటేశ్, వట్టి వసంత్‌కుమార్, తోట నరసింహం, పి.బాలరాజు, ఎన్.రఘువీరారెడ్డి, పి.విశ్వరూప్, గల్లా అరుణకుమారి, డొక్కా మాణిక్యవరప్రసాద్, ధర్మాన ప్రసాదరావు

ఎంపీలు: కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణకుమార్, ఎ.సాయిప్రతాప్, సబ్బం హరి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరు బాపిరాజు, జె.డి.శీలం, కె.వి.పి.రామచంద్రరావు, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి

ఎమ్మెల్యేలు: గాదె వెంకటరెడ్డి, జె.సి.దివాకర్‌రెడ్డి, శిల్పామోహన్‌రెడ్డి, కొండ్రు మురళి, లబ్బి వెంకటస్వామి, శ్రీనివాసరావు, సతీష్‌కుమార్, జోగి రమేష్, మస్తాన్‌వలీ, కన్నబాబు, రాపాక వరప్రసాద్, రౌతు సూర్యప్రకాశరావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కె.సుధాకర్, ఈలి నాని, ఉగ్రనరసింహారెడ్డి, మల్లాది విష్ణు, పి.రమేష్‌బాబు, వెంకటరామయ్య, రాజన్నదొర, డి.వై.దాస్, రాజేశ్‌కుమార్,

ఎమ్మెల్సీలు, ఇతర నేతలు: సుధాకర్‌బాబు, రుద్రరాజు పద్మరాజు, చెంగల్రాయుడు, టి.జి.వి.కృష్ణారెడ్డి, ఐలాపురం వెంకయ్య, సూర్యనారాయణరాజు, శివరామిరెడ్డి, కందుల దుర్గేష్, సింగం బసవపున్నయ్య, శ్రీనివాసులునాయుడు, ఆర్.ఆర్.శ్రీనివాస్, వాకాటి నారాయణరెడ్డి, సి.రామచంద్రయ్య

ఇతర నేతలు: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి, మండలి బుద్ధప్రసాద్, పీసీసీ కార్యదర్శి కె.శివాజీ

kk tho marosari phone lo matladina ఆజాద్

తెలంగాణ నేతలకు మరోసారి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ కే.కేశవరావుతో మరోసారి ఫోనులో సంభాషించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నేతలను ఢిల్లీకి రావాలని ఆజాద్ కోరారు. అయితే స్టీరింగ్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేకే తెలిపినట్లు సమాచారం

speaker chambar yethuta baitainchina nagam

టీడీపీ బహిష్కృత నేత నాగం జనార్ధన్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, జోగిరామన్నలు మంగళవారం ఉదయం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ వారు కూర్చున్నారు. అయితే స్పీకర్ ఆందుబాటులో లేకపోవడంతో కార్యదర్శి వారితో చర్చలు జరిపి సద్దుమనిగేలా చేశారు

ఆజాద్‌పై t_congress aagraham

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అంశంలో ఏ నిర్ణయం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా ప్రాంతాలకతీతంగా హర్షిస్తారు? అనే కోణంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి, కేంద్ర మంత్రి గులాంనబీ అజాద్‌ తెలంగాణ సమస్యను మొదటికి తెచ్చే విధంగా వ్యవహ రించారని ఈ ప్రాంత కాంగ్రెస్‌ సీనియర్‌ నాయ కులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను అయిదు, లేక ఆరు పేజీలతో నోట్‌ను తయారుచేసి ఇవ్వాలని అజాద్‌ కోరడాన్ని పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు తప్పుబడుతున్నారు. అంతేగాక మంగళ వారంనాడు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో మాట్లాడిన అజాద్‌ సంధించిన ప్రశ్నలు, మాట్లాడిన వైనం పరిశీలిస్తే ఒక అడ్వొకేట్‌లా ప్రశ్నలను సంధిం చినట్లుగా ఉందని కొందరు సీనియర్‌ నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్ది న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని, సోనియా మేడమ్‌ ముందు మాట్లాడేందుకు తనకు 'టాకింగ్‌ పాయింట్స్‌ కావాలి కదా! అని ఆజాద్‌ కోరడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. జరిగిన అన్యాయాలకు ప్రతి గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరు తుండగా ఆజాద్‌ ఇలా జరిగిన తప్పులను సరిది ద్దుతానని ముందుకు రావడంతో అనేక అనుమా నాలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను 'ఫూల్స్‌ (తెలివి తక్కువ)ను చేసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకివ్వాలి?, తెలంగాణను ఇస్తే సీమాం ధ్రలో కాంగ్రెస్‌పార్టీ గల్లంతవుతుంది కదా!, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.ఆర్‌.ఎస్‌. అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు లబ్ది చేకూరుతుంది కదా! అని అజాద్‌ నిలదీసినట్లుగా అడగటం తమను కలచివే సిందని అంటున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల గురించి, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాల గురించి, తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌, టి.ఆర్‌.ఎస్‌.ఆవిర్భావం, కె.సి.ఆర్‌.తో అజాద్‌కున్న సంబంధాలు, 2009 డిసెంబర్‌ 9వ తేదీన చిదం బరం చేసిన ప్రకటన, ఆ తర్వాత జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, నివేదికను ఇవ్వడం, అంతకు ముందు ప్రణబ్‌ముఖర్జీ కమిటి, సి.ఎల్‌.పి.లో తీర్మానాలు జరిగినవైనం, సోనియాగాంధీ హామీలు, కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పొందుపరిచిన వైనం, యు.పి.ఎ.ప్రభుత్వంలో కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం, రాష్ట్రపతి ప్రసం గాల్లో తెలంగాణ సమస్యను ప్రస్తావించడం వంటి మొత్తం వ్యవహారంపై కూలంకషంగా, స్పష్టమైన అవగాహన ఉన్న అజాద్‌ ఇప్పుడు ఏమీ తెలియ నట్లుగా 1965 నుంచి ఇప్పటి వరకూ తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ఒక నోట్‌ ఇవ్వాలని కోరడం బాధగా ఉందని పలువురు సీనియర్‌ నాయకులు తీవ్ర మనస్థాపం వ్యక్తంచేస్తున్నారు. పెద్ద మనుషుల ఒప్పందాల ఉల్లంఘన, 610 జీవోను అమలు చేయకపోవడం, ఉద్యోగ, విద్య, వైద్య, వ్యవ సాయం, విద్యుత్తు, ఇతర అనేక రంగాల్లో తెలం గాణ దగాకు గురయ్యిందనే అంశాలపై కాంగ్రెస్‌ అధిష్టానంలో ఏ నాయకుడిని కదిలించినా కనీసం పది పాయింట్లను స్పష్టంగా చెప్పగలరని అంటు న్నారు. అధిష్టానంలో కీలకమైన పాత్ర పోషిస్తూ, ఆంధ్రప్రదేశ్‌పైన, తెలంగాణపైన స్పష్టమైన అవగా హన ఉన్న నాయకుడిగా అధిష్టానం గుర్తించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా వచ్చిన అజాద్‌ ఇలా మాట్లాడటం సబబుగాలేదని, ఆయన తీరును చూస్తుంటే తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రపూరి తంగా వ్యవహరిస్తున్నారేమోననే అనుమానం కలు గుతోందని అంటున్నారు.
ఒకవైపు తెలంగాణను ఇవ్వకుండా నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తే పార్టీకి పుట్టగతులుండవని, కాంగ్రెస్‌ నాయకులెవ్వరూ తెలంగాణ పల్లెల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని అధిష్టానం లోని ప్రతి ఒక్క నేతకూ వివ రిస్తూ వచ్చామని చెప్పారు.అంతేగాక వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మూలంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని, కనీసం తెలంగాణాలోనైనా కాంగ్రెస్‌ను బ్రతికించాలని అధినేత్రి సోనియాగాంధీకి ప్రత్య క్షంగా, పరోక్షంగా వివరిస్తూ వచ్చామని అంటు న్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, చివరకు ఎంపీలు కూడా ఎవ్వరి స్థాయిల్లో వారు తెలంగాణ కోసం ఉద్య మాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారని, ఇంత జరుగుతున్నా, రాజకీయంగా అంతులేని సంక్షోభ పరిస్థితులున్నప్పటికీ అజాద్‌ సాదాసీదాగా తెలం గాణపై నోట్‌ అడగటం,తెలంగాణకు జరిగిన అన్యా యాలను సరిదిద్దుతానని చెబుతుండటం విడ్డూ రంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పటికీ అజాద్‌ను నొప్పించకుండా, తమలోని ఆవేదన, బాధను దిగమింగుకొని నోట్‌కు బదులుగా జరిగిన అన్యాయాల నివేదికలనే అందజేశామని వివరిం చారు.అయిదురాష్ట్రాల ఎన్నికలను సాకుగా చూపిం చి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ వేచి ఉండా లని ఆదేశించినందున తాముఎలాంటి ఉద్యమాలు చేయలేదని, ఈనెలాఖరుకు గానీ, జూన్‌ మొదటి వారంలో స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమ కార్యాచరణలను ప్రకటిస్తామని కాంగ్రెస్‌ అధిష్టా నాన్ని, ముఖ్యంగా గులాంనబీఅజాద్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు హెచ్చరిస్తున్నారు.

bjp jai andhra

‘జై ఆంధ్ర’ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న కమలనాథులు
- రాష్ట్రాలుగా విడిపోతేనే ప్రయోజనమంటున్న శ్రేణులు
- అదే విషయాన్ని సీమాంధ్రలో వివరించేందుకు సిద్ధం
- రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ‘జై ఆంధ్ర’ కోసం తీర్మానం
- ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న కమలనాథులు
- రాష్ట్రాలుగా విడిపోతేనే ప్రయోజనమంటున్న శ్రేణులు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర స్థాయిలో మద్దతు ఇస్తున్న బీజేపీ... అదే స్థాయిలో ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రం రెండుగా విడిపోతే కలిగే ప్రయోజనాలను సీమాంధ్ర ప్రజలకు వివరించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరనుంది. ఇటీవల రెండురోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందించింది. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన తర్వాత బీజేపీలోని తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దీన్ని సీమాంధ్ర ప్రాంత ఆ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న పార్టీ నాయకత్వం అప్పటినుంచి ఇరువూపాంతాల నాయకులతో సంప్రదింపులు జరుపుతూనే తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ వస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇరు ప్రాంతాల నుంచి పాల్గొన్న నాయకుల అభివూపాయాలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్చించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సీమాం్ర ప్రతినిధులు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకించకపోయినా హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంవూధుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికోసం బీజేపీ ప్రత్యేక కార్యక్షికమాన్ని రూపొందించి హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రజల భద్రతకు పూర్తిగా అండగా నిలవాలని నిర్ణయించింది.

సీమాంధ్రలో పట్టుకోసం...
సీమాంవూధలో పార్టీ బలోపేతం జరిగే విధంగా కార్యాచరణను రూపొందించే పనిలో బీజేపీ సమాయత్తం అవుతున్నది. అందుకోసం ఇప్పటి వరకు అధికారంలో ఉన్న సీమాంధ్ర నేతలు సీమాంధ్ర ప్రాంతానికి ఏవిధంగా అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు వివరించడం ద్వారా రాష్ట్ర విభజనకు మార్గం వేయాలని బీజేపీ నాయకత్వం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించింది. విడిపోతే ఏర్పడే ప్రయోజనాలపై సమావేశంలో పార్టీ నేతలు చర్చించారు. అందుకోసం సీమాంవూధలో ఉన్న సహజవనరులు, వాటిని ఉపయోగించుకుంటే కలిగే ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయించింది. దీని ద్వారా సీమాంధ్ర ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేసి తెలంగాణ ఉద్యమాన్ని బలపరచడమే కాక ‘జైఆంధ్ర’ ఉద్యమాన్ని చేపట్టాలని బీజేపీ కార్యవర్గం తీర్మానించింది.

kalasi poradithene telangana

జేఏసీ, టీఆర్‌ఎస్‌లతో పనిచేసేందుకు సిద్ధం
- ఈనెల 21 నుంచి పోరుబాట:ఫోరం
- ఆగస్టు 5 నుంచి నిరహార దీక్షలు

తెలంగాణ రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్‌లతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమేనని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎరవూబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌తో నేరుగా కలిస్తే అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని, మధ్యవర్తుల ద్వారా చెప్పిస్తామని ఆయన అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఫోరం విస్తృత సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఫోరం నేతలు మెత్కుపల్లి నర్సింహులు, కొత్త కోట దయాకర్‌డ్డి, పి.రాములు, పట్నం మహేందర్‌డ్డి, ఎల్.రమణ, అరికెల నర్సాడ్డి, బి కలిసి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసిన వాళ్లంతా కలిసి కట్టుగా ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందని, అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

కేంద్రం దిగి వచ్చే విధంగా తెలంగాణ కోసం పోరాటం చేయాలని తాము నిర్ణయించామని ఎర్రబెల్లి తెలిపారు. ఇందుకోసం ఈనెల 21 నుంచి ఆగస్టు రెండవ వారం వరకు ఉద్యమ కార్యక్షికమాలను రూపొందించామని వివరించారు. గ్రామ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈనెల 21, 24 తేదీల్లో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, స్థానికంగా కలిసి వచ్చే వారందరిని ఈ కమిటీలో కలుపుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ఈనెల 25 నుంచి 31 వరకు పల్లెపప్లూకు టీ టీడీపీ పేరుతో ఊరేగింపులు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 1న అన్ని మండల కేంద్రాల్లో టీ టీడీపీ జెండాలు ఎగురవేస్తామని వివరించారు. ఆగస్టు 5 నుంచి ఇందిరాపార్కు వద్ద వారంరోజులు రోజుకు 10మంది చొప్పున దీక్షలు చేస్తామన్నారు.

రాజకీయేతర సంస్థలతో కలుస్తాం: ఎర్రబెల్లి
రాజకీయ జేఏసీ సహా అందరినీ ఒకే గొడుడు కిందకు వచ్చి ఉద్యమించాలని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రాజకీయేతర సంస్థలతో తాము కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ యునైటెడ్‌ఫోరం నేతలు దిలీప్‌కుమార్, విమల, కేశవరావ్ జాదవ్‌లను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సోమవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ఉద్యమంలో ఎమ్మెల్సీ దిలీప్ మొదటి నుంచి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. జేఏసీతో సహా అందరూ పార్టీని, జెండా, ఎజెండాలను వదలిపెట్టి ఒక్కటిగా పని చేయాలని కోరారు. ప్రస్తుత జేఏసీ తెలంగాణకు చొరవ చూపడం లేదని విమర్శించారు. అవసరమైతే పార్టీని వదులుకొని వస్తానని తాను పేర్కొనడాన్ని దిలీప్‌కుమార్ స్వాగతించారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికలంటూ వస్తే ఇక తెలంగాణ రాష్ట్రంలోనే రావాలని పేర్కొన్నారు.

telangana kosam maro balithanam

సీమాంధ్ర నాయకులు సోమవారం ఢిల్లీ వెళ్లడంతో తెలంగాణను అడ్డుకుంటారనే బెంగతో టీఆర్‌ఎస్ కండువాతోనే సొంత చేనులో ఆ పార్టీ కార్యకర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నిజామాబాద్ జిల్లాలోని కామాడ్డి మండలం గర్గుల్ గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు వడ్ల నాగభూషణం(50) ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. సోమవారం సీమాంధ్ర ఎంపీలు ఢిల్లీకి వెళ్లిన విషయాన్ని టీవీలో ఉదయం నుంచి చూశాడు. గ్రామ కూడలిలోని హోటళ్లో సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకుంటున్నారని స్థానికులతో చర్చించాడు.

ఆవేదనతో కలత చెంది సాయంత్రం పొలానికి వెళ్లి టీఆర్‌ఎస్ కండువాతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డు. ‘తెలంగాణ కోసం చనిపోతున్నా, తెలంగాణ వస్తదని అందరికి చెప్పే వాడిని, రాష్ట్రం ప్రకటించకుండా కేంద్రం ప్రదర్శిస్తున్న వైఖరికి నిరసనగా చనిపోతున్నా, నా చావుతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే తెలంగాణను ప్రకటించాలి’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

rajinamala amotham eka lenatle

జిల్లాపరిషత్ ప్రాదేశిక సభ్యుల్లో కొందరి రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం లేనట్టేనని తేలిపోయింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు రాజీనామా బాటను ఎంచుకున్నారు. తాము తెలంగాణకు ముందువరుసలో ఉన్నామని ప్రజలకు భ్రమ కల్పించారు. రాజీనామాలు ఆమో దించే రీతిలో (ఫార్మట్‌లో)కాకుండా ఇతర మార్గాలను అనుసరించి రాజీనామాలు చేసి ఆమోదం పొందేందుకు తిరకాసును ఎంచుకున్నారు. ఇటు ప్రజాగ్రహానికి గురికాకుండా, అటు రాజీనామా ఆమోదం పొందకుండా ద్వంద్వ నీతిని ప్రద ర్శించారు.

ఉత్తుత్త రాజీనామాలు చేసి తెలంగాణపై తమకున్న ఆకాంక్ష ఏ పాటిదో ప్రజలకు చాటి చెప్పుకున్నారు. నిబంధనల ప్రకారం వివిధ మార్గాల ద్వారా రాజీనామాలు సమర్పించిన జడ్పీటీసీలకు వ్యక్తిగతంగా వారి వివరణ కోరేందుకు కలెక్టర్ తేదీ నిర్ణయించి ముందుగా వారికి సమాచారం అందించాలి. సభ్యుల పదవీకాలం ఈ నెల 21తో ముగుస్తోంది.

అంటే ఈ లెక్కన రాజీనామాల ఆమోదం సాధ్యపడదనే విషయం స్పష్టమవుతోంది. జిల్లాలో 36 మంది జడ్పీటీసీలకు గాను 20 మంది రాజీనామాలు చేశారు. వీరిలో మొదట 8 మంది జడ్పీటీసీలు రాజీనామాలు ఆమోదించే విధంగా పంపించారు. అందరికంటే ముందు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా చేసిన డిచ్‌పల్లి జడ్పీటీసీ దినేష్‌కుమార్ అనంతరం కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామాను ఆమోదించుకున్నారు. ఇక మిగతా 19 మంది జడ్పీటీసీలు తమ రాజకీయ వక్రబుద్ధిని చాటుకున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts