Monday 25 July 2011

malli mothatikochina telangana

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. విస్త్రృతస్థాయి సంప్రదింపులు, చర్చల తర్వాతే కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఇప్పటికే జరిగిన సంప్రదింపులు, చర్చలను కేంద్రం గాలికొదిలెసింది. మళ్లీ తాజాగా సంప్రదింపులు, చర్చల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేనట్లేనని కేంద్రం చెప్పకనే చెప్పింది. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ శనివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మరోసారి సంప్రదింపులు, చర్చల ప్రక్రియ అంశాన్ని లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై విస్త్రృతస్థాయి సంప్రదింపుల, చర్చలు తర్వాతే కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఇప్పటికే ఈ అంశంపై ఎన్నోసార్లు విస్త్రృతస్థాయిలో సంప్రదింపులు జరిగాయి. చర్చలు ముగిశాయి. అయినా కేంద్ర ప్రభుత్వానికి ఇవేమి సంతృప్తినివ్వలేదు. మళ్లీ తిరిగి సంప్రదింపులు, చర్చలను ప్రారంభించాలని నిర్ణయించింది. సంప్రదింపులు, చర్చల పేరిట కేంద్రం కాలయాపన చేసే మంత్రంగాన్ని రచిస్తోందని తెలంగాణ వాదులు ఆజాద్‌ చేసిన ప్రకటనపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్ధలుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి చర్చలు, సంప్రదింపుల పేరిట కేంద్రం దాటవేత ధోరణి తెలంగాణ ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్‌ తొమ్మిదవ తేదీన ప్రకటించిన యుపిఏ సర్కారే తిరిగి మళ్లీ విస్త్రృతస్థాయి సంప్రదింపులు, చర్చలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

అటువంటప్పుడు మరి డిసెంబర్‌తొమ్మిదవ తేదీ ప్రకటన ఎందుకు చేసిందని ప్రశ్నించారు. డి సెంబర్‌ తొమ్మిదవ తేదీ తరువాత రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి అన్ని వర్గాల వారితో, సంఘాలు, రాజకీయ పార్టీలతో విస్త్రృతస్థాయి సంప్రదింపులు జరిపి కేంద్రానికి నివేదిక అందజేసిందన్నారు. అంతకు మించి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎవ్వరితో సంప్రదింపులు జరుపుతుందని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాల నేపథ్యంలో కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడితో తప్పనిసరిగా ఎదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల నుండి తప్పించుకునేందుకే కేంద్రం సంప్రదింపులు, చర్చల ప్రస్తావనను తెరమీదకు తీసుకువచ్చిందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఒత్తిడితోనే ఈ ప్రకటన చేసిందని తెలంగాణ వాదులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై మరికొంత కాలం సంప్రదింపులు, చర్చల పేరిట కాలయాపన చేస్తే ఉద్యమం నీరుగారిపోతుందని కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనావేస్తున్నారు.

కేంద్రం నిర్ణయం ద్వారా సమీప భవిష్యత్తులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభానికి నోచుకునే అవకాశాలు ఎంత మాత్రం లేవంటున్నారు. ఉద్యమాల వల్ల అభివృద్ధి కుంటుపడడం మినహా కేంద్రం ఏమాత్రం స్పందించినట్లుగా కనిపించడం లేదంటున్నారు. ప్రజాప్రతినిధుల రాజీనామాలు సైతం కేంద్రంపై పెద్దగా ప్రభావం చూపినట్లుగా కనిపించడం లేదంటున్నారు. దీనికంతటికి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో రాజీనామాలు చేయకపోవ డమే కారణమని పేర్కొంటున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత టీ-కాంగ్రెస్‌ నేతల స్వరం మారిందన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువద్దామనే మాటను ప్రయోగించడానికి వారు ఎంత మాత్రం ఇష్టపడడం లేదన్నారు.

కాంగ్రెస్‌ అధిష్టానం ఒత్తిడితో టీ-కాంగ్రెస్‌ నేతలు మెత్తబడినట్లుగానే కనిపిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం మంత్రి గులాం నబీ ఆజాద్‌ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ గుండుగుత్తగా టీ-ప్రజాప్రతినిధుల రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడం వెనుక కేంద్ర ప్రభుత్వ నిర్ణయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంకాన్ని మరికొంతకాలం సంప్రదింపులు, చర్చల ప్రక్రియ ద్వారా సాగదీయాలని కేంద్రం యోచి స్తున్నట్లు తెలుస్తోందంటున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పట్లో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అంశం మళ్లీ ‘రెడ్డొచ్చె మొదలా యో’ అన్న చందంగా తయారయిందంటున్నారు.

prarambamina lalu tharvaja bonalu

పాతబస్తీలోని లాల్‌ దర్వాజ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామునుంచే భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. మూసీ వరదల సమయంలో నిజాం నవాబు సైతం ఈ ఆలయానికి బోనాలు సమర్పించారని చరిత్ర చెబుతోంది. ఈరోజు నగరంలో దాదాపు 500 ఆలయాల్లో బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీ 25 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. లాల్‌దర్వాజ అమ్మవారిని ఈరోజు ఉదయమే టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ దర్శనం చేసుకున్నారు. అమ్మవారి బోనాలతో హైదరాబాద్‌ సందడిగా మారింది. ఆయా ఆలయాల వద్ద పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అమ్మవారి పాటలతో భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

telangana vachentha varuku vudyamam:sridhar babu

తెలంగాణ రాష్ట్రం సాధించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం రాజీనామాలు చేసిన ఎంపీలు,ఎమ్మెల్యేలు, మంత్రులమంతా ఒకేవిధానంతో ముందుకు సాగుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రం తెలంగాణ విషయం తేల్చేంతవరకు, డిసెంబర్ 9 ప్రకటనపై స్పష్టత వచ్చేంతవరకు సంఘటితంగా ఉద్యమిస్తామన్నారు. తెలంగాణపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి తమకు ఆహ్వా నంవచ్చిందని, రేపు ఢిల్లీకి వెళ్లే బృందంలో తానూ ఉన్నానన్నారు.

speaker dhisti bomma dhahanam:jai telangana

స్పీకర్ దిష్టిబొమ్మల దహనం

ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమో దించనందుకు నిరసనగా టీఆర్ఎస్, ో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఎంపీ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు. సమైక్యాం«ద్రులను తెలంగాణ నుంచి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. ఉట్నూరు, ముథోల్, కుభీర్‌లలో స్పీకర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు.

ప్రజాప్రతినిధుల రాజీనామాలను ఆమోదించాలనీ, పార్లవె ంగాణ కోసం కాళేశ్వరంలో మహారుద్రాభిషేకం కాటారం: కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రం లో సిద్ధిపేట బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ కోసం ఆదివారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్‌నుంచి వచ్చిన 60మందిబ్రాహ్మణులు ఈకార్యకమ్రంలో పాల్గొన్నారు.

bonamettina telangana

హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద భక్తుల సందడి. పోతరాజుల నృత్యాలు, విచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాలు... బోనాల జాతరతో అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి

parties havent decided yet on resignations

తొందరపాటు వద్దంటున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఎంపీల రాజీనామాలపై తేలే దాకా ఆగాలని నిర్ణయుం!
ఇకపై రాజీనామా చేయబోమన్న ఇద్దరు ఎమ్మెల్యేలు
నేడు నిర్ణయిస్తామన్న టీడీపీ తెలంగాణ ఫోరం
‘వేచి చూస్తున్న’ టీఆర్‌ఎస్.. నేడే రాజీనామాలంటూ లీకులు
ఇకపై రాజీనామాలు చేయబోమన్న బీజేపీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరిస్తూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీసుకున్న నిర్ణయం అన్ని పార్టీలనూ అంతులేని అయోమయంలో పడేసింది! మళ్లీ రాజీనామా చేయడమా, మానడమా అన్నదానిపై అవి ఏ నిర్ణయూనికీ రాలేక సతమతమవుతున్నారుు. కాంగ్రెస్, టీడీపీ ఆదివారమంతా దీనిపై సుదీర్ఘంగా చర్చించినా ఎటూ తేల్చుకోలేకపోయాయి. ఇప్పటికే ఓసారి రాజీనామాలు చేయడం ద్వారా గీత దాటామన్న అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి కలిగించినందున ఈసారి తొందర పడొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. తీరా తాము రాజీనామా చేశాక కాంగ్రెస్ చేయకుంటే ఏం చేయడమా అని టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఆ రెండు పార్టీల వైఖరి తేలందే తాను రాజీనామా చేసినా ఏ మేరకు ప్రభావముంటుందో తేలక టీఆర్‌ఎస్ మథనపడుతోంది!

పంచాయతీరాజ్ వుంత్రి జానారెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎర్రబెల్లి దయూకర్‌రావు నాయకత్వంలో తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు ఆదివారం సవూవేశమై వుళ్లీ రాజీనామాలు చేసే విషయుమై చర్చించారు. సోమవారం కూడా ఢిల్లీలో సమావేశమైన అనంతరం నిర్ణయుం వెల్లడిస్తావుని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అయితే ఈసారి తొందర పడొద్దని వారు దాదాపుగా నిర్ణయూనికి వచ్చినట్టు తెలిసింది. ‘‘అరుుందేదో అరుుంది. ఇకపై రాజీనామాల విషయుంలో ఆచితూచి వ్యవహరించాలి. రాష్ట్రం కోసం అధిష్టానం, కేంద్ర ప్రభుత్వాలపై మరింతగా పోరాడి, అప్పటికీ ఫలితం లేకపోతేనే మళ్లీ రాజీనావూలపై ఆలోచించాలి’’ అన్నది వారి అంతర్గత ఆలోచనగా చెపుతున్నారు. సోమవారం స్టీరింగ్ కమిటీ భేటీ తర్వాత నిర్ణయుం ప్రకటిస్తామని చెప్పినా, ఇప్పట్లో మళ్లీ రాజీనామాలు ఉండకపోవచ్చని పీసీసీ సీనియుర్ నేత ఒకరు వెల్లడించారు.సోమవారం నుంచి ఎటూ అధిష్టానంతో సంప్రదింపులున్నందున కొద్ది రోజులు రాజీనామాలకు దూరంగా ఉండటమే మేలని ఇతర సీనియుర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. జానా నివాసంలో భేటీలోనూ ఇదే అభిప్రాయుం వ్యక్తమైనట్టు సవూచారం.

తెలంగాణ రాజకీయ జేఏసీ ‘సకల జనుల సమ్మె’కు మద్దతిచ్చి, ఎంపీల రాజీనామాలపై ఏదోటి తేలేదాకా వేచి చూడాలన్నది నేతల అభిప్రాయుం! మరోవైపు, తామిక రాజీనామా చేయబోవుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నర్సారెడ్డి (గజ్వేల్), నందీశ్వర్‌గౌడ్ (పటాన్‌చెరు) ప్రకటించడం పార్టీలోని వారి సహచరులను మరింత సందిగ్ధంలో పడేసింది! నిజానికి రాజీనామాల కంటే అధిష్టానంపై ఒత్తిడి తేవడమే మేలనే ధోరణిలో చాలామంది ఎమ్మెల్యేలు కన్పిస్తున్నారు. పైగా వుంత్రులు కూడా మళ్లీ రాజీనామాలకు సుముఖంగా లేరంటున్నారు. వారితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ ఇప్పటికే ఫోన్లో మాట్లాడినట్టు సవూచారం. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మళ్లీ రాజీనామాలపై కచ్చితమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. అందరి కంటే వుుందు రాజీనామాలు చేయడం ద్వారా, తాము తెలంగాణకు సానుకూలవుంటూ ప్రజల్లో విశ్వాసం కల్పించగలిగామని భావిస్తున్న వారు, ఈసారీ అదే పంథా అనుసరిస్తే ఎలా ఉంటుందని ఆదివారం నాటి ఫోరం భేటీలో చర్చించారు. సోమవారం వుూకువ్ముడిగా రాజీనామాలు చేయూలన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే, దీనిపై తొందరపడకుండా కాంగ్రెస్ నిర్ణయూన్ని బట్టి స్పందించడం మేలని వారు భావిస్తున్నారు. బయటికి మాత్రం, సోమవారం మరోసారి భేటీ అయ్యాక రాజీనామాలు సమర్పిస్తామని అంటున్నారు! ఇక టీఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్, టీడీపీల పరిణామాలను జాగ్రత్తగా గవునించడం మినహా రాజీనామాలపై ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదు. దీనిపై ఆ ఎమ్మెల్యేలు ఏమీ మాట్లాడకపోయినా, తమ ఎమ్మెల్యేలు సోమవారం రాజీనా మా చేస్తారని ఆ పార్టీ వుుఖ్యుడొకరన్నారు. అప్పుడే టీడీపీ, కాంగ్రెస్‌లపై ఒత్తిడి పెరుగుతుందని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. కానీ ఆ తర్వాత కూడా రాజీనామాలకు అవి వెనకడుగు వేస్తే తాము ఒంటరయ్యే ప్రమాదముందని కొందరు టీఆర్‌ఎస్ నేతలు శంకిస్తున్నారు. అప్పుడు ఒంటరిగానే ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని, తరచూ ఉప ఎన్నికలపై ప్రజల్లో నిరుత్సాహం ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. రాజీనామాలపై మళ్లీ అంతా ఒకే తాటిపై నడిస్తేనే మేలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంటున్నారు! టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలైన నాగం జనార్దనరెడ్డి బృందం మాత్రం ఆదివారమే రాజీనా మాలు చేయుడం విశేషం! మరోవైపు బీజేపీ మాత్రం ఇకపై రాజీనామాలు చేయొద్దని నిర్ణయించినట్టు తెలిసింది.

T News Blasts TV9 Full Left & Right To Andhra Media

second time trs mla's resign

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రెండోసారి రాజీనామా చేశారు. ఫ్యాక్స్‌ద్వారా స్పీకర్‌కు రాజీనామా లేఖలను పంపారు. భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణంగా పరిగణిస్తూ మొదటి సారి రాజీనామాలను స్పీకర్ నాదేండ్ల మనోహర్ తిరస్కరించారు.

bonamethina bagyanagaram:telangana bonalu

మార్మోగిన తెలం‘గానం’
- బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న ప్రముఖులు
- అడ్డంకులు తొలగాలని ప్రజావూపతినిధుల ఆకాంక్ష
- లాల్‌దర్వాజలో ఆకర్షించిన ‘ప్రత్యేక’ బోనం


చంద్రాయణగుట్ట, జూలై 24 (టీ న్యూస్): భాగ్యనగరం ఆదివారం ‘ప్రత్యేక’ బోనమెత్తింది.. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను తన భుజాలకెత్తుకొని వినిపించింది.. తెలంగాణ ఏర్పాటుకు ఇదే మంచితరుణమని నినదించింది. బోనాల ఉత్సవాలు ప్రతి గల్లీలో ఘనంగా జరిగాయి. పచ్చని తోరణాలు.. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అన్ని ప్రాంతాలు కొత్తశోభను అలుముకున్నాయి. పాతబస్తీలోని దేవాలయాలు, వీధులు వేలమంది భక్తులతో కిక్కిరిశాయి. గంటలపాటు మహిళలు క్యూలో నిలబడి అమ్మవారికి బోనాలు సమర్పించారు.

కుటుంబాలను చల్లగా చూడాలని, రాష్ట్రం ఏర్పడేలా వరమివ్వాలని వేడుకున్నారు. ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీనటులు, నేతలు, వివిధరంగాలవారు తరలిరావడంతో పాతబస్తీ సందడిగా మారింది. ఆలయాల్లో పూజలు నిర్వహించి అభివూపాయాలను పంచుకున్నారు. తెలంగాణ ఆకాంక్షను వినిపించారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి మాతకు కొందరు మహిళలు ‘ప్రత్యేక’ బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కావాలని రాసి అమ్మ వారిని వేడుకున్నారు. ఈ బోనం అందరినీ ఆకర్షించింది.

అందరికీ మంచి జరుగుతుంది: ఉప ముఖ్యమంత్రి
అమ్మవారి అనుక్షిగహం వల్లనే మానవాళికి అన్ని విధాలా మంచి జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంప్రదాయాన్ని, సంస్కృతిని ఇనుమడింపజేస్తున్నాయని పేర్కొన్నారు.

డిసెంబర్ ఞైపకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలి: గద్దర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ చేసిన రాజీనామాలు నిరసనలో భాగంగానే పరిగణించాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. రాజీనామాలు తిరస్కరణకు గురవుతాయన్న అంశం ముందుగా ఊహించిందేనని చెప్పారు. తెలంగాణపై డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కేంద్రవూపభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. సీమాంవూధపాలకుల బుద్ధి మార్చి తెలంగాణ వచ్చేలా దీవించాలని అమ్మవారిని గద్దర్ వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలపించిన పాటలు ఆలోచింపజేశాయి.

బోనం సమర్పించిన కవిత
రాంభక్షీబండలోని బంగారు మైసమ్మ దేవాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల బోనం సమర్పించారు. రాష్ట్రం వెంటనే ఏర్పడాలని, వచ్చేసారి తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్సవాలు జరిగేలా దీవించాలని ప్రార్థించారు.

తెలంగాణ వస్తే బంగారు బోనం సమర్పిస్తా: విజయశాంతి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని ఎంపీ విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసగిస్తూనే ఉందని, ఆ పార్టీని నమ్మకుండా ప్రతిఒక్కరూ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రం కలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అమ్మవారికి బంగారుబోనం సమర్పిస్తానని ప్రకటించారు.

అడ్డంకులు తొలగాలి:
కాంగ్రెస్ ఎంపీలు

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధు యాష్కిగౌడ్, సిరిసిల్ల రాజయ్య, వివేక్, మందా జగన్నాథంలు పాతబస్తీలోని పలు ఆలయాలను సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటుకు అవాంతరాలను తొలగించాలని, వ్యతిరేకుల మనసు మార్చాలని వేడుకున్నామని తెలిపారు. పాతబస్తీలో తెలంగాణ ఉద్యమం లేదని విర్రవీగుతున్న సీమాంధ్ర నాయకులు ఈ బోనాల ఉత్సవాలను చూసి తెలుసుకోవాలని కాంగ్రెస్ ఎంపీలు హితవుపలికారు.

ప్రముఖుల సందర్శన
మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్, వినోదిని దంపతులు, దేవాదాయశాఖ కమిషనర్ బలరామయ్య, జాయింట్ కమిషనర్ వి.కృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ రమణమూర్తి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య, వేదకుమార్, పీసీసీచీఫ్ బొత్స, మంత్రులు ముఖేష్, దానం, ఎంపీ అంజన్ కుమార్‌యాదవ్, ఆలె నరేంద్ర, మాజీ మంత్రులు సి.కృష్ణాయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ నేతలు దత్తావూతేయ, వెంకట్‌డ్డి, డాక్టర్ లక్ష్మణ్, బద్దం బాల్‌డ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణాడ్డి, దేవి ఉపాసకులు దైవజ్ఞశర్మ, సినీనటుడు బాలు, డీజీపీ దినేష్‌డ్డి, డీసీపీ వినీత్‌వూబిజ్‌లాల్, టీఆర్‌ఎస్ నేతలు ఎంఎస్ రాంరెడ్డి, లలిత, యశ్వంత్‌కుమార్, ఎన్.కిరణ్‌డ్డి, పోసాని సదానంద్‌ముదిరాజ్, తిరుపతి శివకుమార్, ఉమ్మడిదేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఆలె భాస్కర్‌రాజు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

e sari andharu raginama cheyali:ktr

తెలంగాణ కోసం గతంలో రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులతో పాటు రాజీనామా చేయని వారు కూడా ఈసారి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్పీకర్ రాజీనామాలు ఆమోదించలేదనే కుంటిసాకుతో వెనక్కి తగ్గితే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజాభిప్రాయం ప్రకారమే ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. జైపాల్‌రెడ్డి తన నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని అమరవీరుడు యాదిరెడ్డి రాసిన సూసైడ్ నోట్ చైసైనా జైపాల్‌రెడ్డి లాంటి వాల్లు కళ్లు తెరవాలని తెలిపారు. జైపాల్‌రెడ్డి ఇప్పటికే చాలా కాలం పదవిని పట్టుకుని వేలాడాడన్నారు. వెయ్యేళ్లు ఎవరూ జీవించరని, ఇప్పటికైనా, ఈ ముసలితనంలో తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసి తెలంగాణ ద్రోహిగా ముద్రపడకుండా జైపాల్‌రెడ్డి నడుచుకోవాలని కోరారు.
In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts